దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న బారీ చిత్రం ‘వారణాసి’ ఇంకా షూటింగ్ దశలోనే ఉంటున్నా, దాని వారణాసి ఓటీటీ డీల్ గురించి ఇప్పటి నుంచే పెద్ద చర్చ మొదలైంది. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి స్టార్లు ఉన్న ఈ చిత్రం 2027లో థియేటర్లోకి రానుంది.
పుష్ప 2 రికార్డును మించాలని పట్టు
నివేదికల ప్రకారం, వారణాసి పోస్ట్-థియేట్రికల్ స్ట్రీమింగ్ హక్కుల కోసం నెట్ఫ్లిక్స్ తీవ్ర ఆసక్తి చూపుతోంది. అయితే చిత్ర నిర్మాతలు పుష్ప 2 – ది రూల్ సాధించిన రూ.275 కోట్ల రికార్డు డీల్ కంటే దాదాపు 25 శాతం ఎక్కువ రేటు డిమాండ్ చేస్తున్నారని సమాచారం. దీంతో నెట్ఫ్లిక్స్, నిర్మాతలు కోరుతున్న మొత్తంలో సగమే ఆఫర్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
బండ్ల్ స్ట్రాటజీ వెనుక ఆలోచన
కేవలం స్ట్రీమింగ్ రైట్స్కే పరిమితం కాకుండా, ప్రోమోషనల్ ఈవెంట్లు, బిహెండ్-ది-సీన్స్ ఫుటేజ్తో కూడిన పూర్తి ప్యాకేజ్ని ఓటీటీ సంస్థలకు ఆఫర్ చేయాలని రాజమౌళి టీమ్ యోచిస్తోందని తెలుస్తోంది. బారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రానికి సరిపడా రాబడి తెసుకురావాలన్ లక్ష్యంతోనే ఈ స్ట్రాటజీ అని విశ్లేషకులు చెబుతున్నారు.
వారణాసి ఓటీటీ డీల్ ఎటు తిరుగుతుందో, ఎంత మొత్తానికి ఫైనల్ అవుతుందో అన్నది టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఈ డీల్ కుదిరితే, బారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక ఓటీటీ డీల్గా నిలేబడే అవకాశం ఉందని అంచనాలు వెలువడుతున్నాయి.





